ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్‌ను సమర్థిస్తున్నాం : ఓవైసీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 13, 2018, 10:48 AM

హైదరాబాద్ : శాసనసభ నుంచి కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్‌ను సమర్థిస్తున్నాం.. న్యాయబద్ధమైనదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. శాసనసభలో ఓవైసీ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీవి అసహన రాజకీయాలు, ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు దురదృష్టకరమన్నారు. గవర్నర్ మీద దాడి చేయాలనుకున్నాం కానీ.. మండలి చైర్మన్‌కు తగిలిందని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. నిన్న జరిగిన దాడి ఘటనకు సంబంధించిన వీడియోను విడుదల చేయాలని సభకు విజ్ఞప్తి చేశారు. సభలో జరిగే ప్రతి విషయం ప్రజలకు తెలియాలన్నారు. దేశంలో అన్ని చోట్ల ఓటమి పాలవటంతో కాంగ్రెస్ పార్టీ అసహనంతో ఉందన్నారు. ప్రజల తీర్పును కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుందన్నారు. సభా గౌరవం కాపాడేందుకు అందరం కట్టుబడి ఉండాలని ఓవైసీ సూచించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa