హైదరాబాద్ :శాసనసభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని సిఎల్పి నాయకుడు జానారెడ్డి అన్నారు. సభ తీసుకున్న నిర్ణయంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని ఆయన చెప్పారు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిని, మండలిలో విపక్ష నేతను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామికమని జానారెడ్డి అన్నారు. ప్రతిపక్ష సభ్యులందరినీ సస్పెండ్ చేయడం గర్హించదగిన చర్య అని ఆయన అన్నారు. నిన్న సభలో జరిగిన సంఘటన గవర్నర్ పరిధిలోనిదని ఆయన చెప్పారు. ఈ విషయంపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ఈ ప్రభుత్వానికి అధికారం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయడం కేసీఆర్ సైకలాజికల్ గేమ్ అని టీ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల అసెంబ్లి చరిత్రలో సభలో విపక్ష నేతని సస్పెండ్ చేయడం ఇదే మొదటిసారన్నారు. సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడి రాజీనామా చేయాలనే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. అన్ని స్థానాలకు రాజీనామాలు చేస్తే మొత్తం ఉప ఎన్నికలకు వెళ్లొచ్చన్నది కాంగ్రెస్ వ్యూహంగా తెలుస్తోంది. శాసనసభ సభ్యత్వం రద్దు అంశంపై ఎమ్మెల్యేలు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa