హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. అసెంబ్లిd మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ… అసెంబ్లిలో నిన్న జరిగిన ఘటన నాటకీయం, డ్రామా అని పేర్కొన్నారు. ఇటు కూర్చున్న వ్యక్తికి అటువైపు కన్నుకు ఎలా దెబ్బతగులుతుందని ప్రశ్నించారు. గతంలో హరీశ్రావు సభా సాక్షిగా గవర్నర్పై దాడికి యత్నించినా కాంగ్రెస్ సంయమనం పాటించిందన్నారు. అలాంటి వ్యక్తే ఇవాళ సభలో సభ్యత్వం రద్దును ప్రతిపాదించడం దారుణమన్నారు.