తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,103 పాఠశాలలకు చెందిన 5,38,867 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2542 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. మార్చి 29 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల పర్యవేక్షణ కోసం 148 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. తొలి రోజు ప్రథమ భాషా పరీక్షలు తెలుగు, ఉర్దూ, హిందీ తదితర పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8.45 వరకు పరీక్షా కేంద్రంలో ఉండాలని విద్యార్థులకు అధికారులు సూచిస్తున్నారు.