కొలంబో వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్లో సగర్వంగా టీమిండియా ఫైనల్కి చేరింది. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ (89: 61 బంతుల్లో 5x4, 5x6), స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ (3/22) అద్భుత ప్రదర్శన చేయడంతో బంగ్లాదేశ్ని 17 పరుగుల తేడాతో భారత్ చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. రోహిత్ శర్మ, సురేశ్ రైనా (47: 30 బంతుల్లో 5x4, 2x6) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ముష్ఫికర్ రహీమ్ (72 నాటౌట్: 55 బంతుల్లో 8x4, 1x6) చివరి వరకూ ఒంటరి పోరాటం చేసినా బంగ్లాదేశ్ని గెలిపించలేకపోయాడు. భారత బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో ఆ జట్టు చివరికి 159/6కే పరిమితమైంది. ఈ టోర్నీలో టీమిండియా చేతిలో బంగ్లాదేశ్ ఓడిపోవడం ఇది వరుసగా రెండోసారి.. ఇక లీగ్ దశ చివరి మ్యాచ్ శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య శుక్రవారం జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుతో ఆదివారం భారత్ జట్టు ఫైనల్ ఆడనుంది.
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా భారత్ని బ్యాటింగ్కు ఆహ్వానించాడు. టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్ల్లోనూ 0, 17, 11 పరుగులతో నిరాశపరిచిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో చాలా పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. ఊరించే బంతులు విసిరినా.. పవర్ ప్లేలో ఎలాంటి సాహసాలకీ వెళ్లకుండా జాగ్రత్తపడిన రోహిత్ శర్మ చివర్లో ఆకాశమే హద్దుగా భారీ షాట్లతో చెలరేగిపోయాడు. ఆరంభంలో రోహిత్ శర్మ ఇబ్బంది పడుతుండటంతో.. స్కోరు బోర్డుని నడిపించే బాధ్యత తీసుకున్న ఓపెనర్ శిఖర్ ధావన్ (35: 27 బంతుల్లో 5x4, 1x6) తనదైన శైలిలో బౌండరీలు బాదేశాడు. దీంతో భారత్ జట్టు.. 9.4 ఓవర్లు ముగిసే సమయానికి 70/0తో మెరుగైన స్థితిలో నిలిచింది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa