తమిళనాడు రాజకీయాల్లోకి మరో పార్టీ దూసుకువచ్చింది. అన్నాడీఎంకే రెబల్ నేత, శశికళ బంధువు టీటీవీ దినకరన్ తన స్వంత పార్టీని ఈరోజు ప్రకటించారు. 'అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం' పేరుతో పార్టీని స్థాపించిన దినకరన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. దినకరన్ పార్టీ జెండాపై జయలలిత చిత్రాన్ని ముద్రించారు. ఈ సందర్భంగా మాట్లాడిన దినకరన్... పన్నీర్, పళని అన్నాడీఎంకేను మోసం చేశారని ఆరోపించారు. కొత్తగా ఏర్పాటైన దినకరన్ పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగనుంది. ఇటీవల ఆర్కేనగర్లో జరిగిన ఉపఎన్నికల్లో దినకరన్ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa