హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశ పెడుతున్నారు. ఈటల అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది ఐదో సారి. బడ్జెట్ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఈ నాలుగేళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుత పథకాలతో రాష్ట్రంలో ప్రగతి, ప్రజాసంక్షేమానికి కృషి చేశారన్నారు. తమది సకల జనుల బడ్జెట్ అని ఈటల చెప్పారు. స్థూల ఉత్పత్తిలో గణనీయ ప్రగతి సాధించామన్నారు. రాష్ట్ర జీడీపీ ఎటేటా పెరుగుతోందన్నారు. ఎన్నో వినూత్న పథకాలతో గణనీయ ప్రగతి సాధించామన్నారు. రాష్ట్ర జీడీపీ ఏటేటా పెరుగుతోందని చెప్పిన మంత్రి ఈటల ఈ ఏడాది జీడీపీ వృద్ధిని 10.4శాతంగా అంచనా వేశారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆయన ఈ నాలుగేళ్ల పయనంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించామని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి ఎన్నో చర్యలు తీసుకున్నామని చెప్పారు.
-మొత్తం రాష్ర్ట బడ్జెట్ రూ. 1,74,453 కోట్లు
-రెవెన్యూ వ్యయం రూ. 1,25,454 కోట్లు
-రాష్ర్ట ఆదాయం రూ. 73,751 కోట్లు
-కేంద్ర వాటా రూ. 29,041 కోట్లు
-రెవెన్యూ మిగులు అంచనా రూ. 5,520 కోట్లు
-ద్రవ్య లోటు అంచనా రూ. 29,077 కోట్లు
-గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 1500 కోట్లు
-పట్టణాభివృద్ధికి రూ. వెయ్యి కోట్లు
-కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ కు రూ. 1450 కోట్లు
-మహిళా శిశు సంక్షేమానికి రూ. 1799 కోట్లు
-డబుల్ బెడ్ రూం ఇండ్లకు రూ. 2,643 కోట్లు
-నీటిపారుదల రంగానికి రూ. 25 వేల కోట్లు
-పంటల పెట్టుబడి మద్దతు పథకానికి రూ. 12 వేల కోట్లు
-రైతు బీమా పథకానికి రూ. 500 కోట్లు
-వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 522 కోట్లు
-బిందు తుంపర సేద్యం రూ. 127 కోట్లు
-పౌరసరఫరాల శాఖకు రూ. 2946 కోట్లు
- ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త పంచాయతీరాజ్ బిల్లు
-జీడీపీ ద్రవ్య లోటు 3.45 శాతం
-ఈ ఏడాది రాష్ర్ట జీడీపీ 10.4 శాతంగా ఉంటుందని అంచనా
-స్థూల ఉత్పత్తిలో గణనీయ ప్రగతి సాధించాం
-రాష్ర్ట జీడీపీ ఏటేటా పెరుగుతుంది
-ఈ నాలుగేళ్ల ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు అధిగమించాం
-సీఎం కేసీఆర్ ఆర్థిక స్థితిని గాడిలోకి తెచ్చారు
-ఐదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టడం సంతోషంగా ఉంది
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa