హైదరాబాద్ః ఊహించినట్లే రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట వేసింది ప్రభుత్వం. రాష్ట్రాభివృద్ధిలో వ్యవసాయ రంగమే కీలకమని అన్న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్.. బడ్జెట్లో మొదట వ్యవసాయ రంగానికి చేసిన కేటాయింపుల గురించే ప్రస్తావించారు. ఇందులో ప్రముఖంగా పెట్టుబడి పథకం గురించి ప్రస్తావించారు. ఈ పథకం కోసం ఏడాదికి రూ.12 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రెండు పంటలకు కలిపి ఎకరాకు రూ.8 వేలు ఇవ్వనున్నట్లు చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణకు రూ.522 కోట్లు కేటాయించారు. భూ రికార్డుల ప్రక్షాళన కోసం ధరణి వెబ్సైట్ను ప్రారంభించినట్లు తెలిపారు. పాలీ, గ్రీన్హౌజ్ కోసం రూ.12 కోట్లు. రైతు బీమా పథకం కోసం రూ.500 కోట్లు కేటాయించడం గమనార్హం. రైతులకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు ఈటల చెప్పారు. బిందు, తుంపర సేద్యానికి రూ.127 కోట్లు కేటాయించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa