హైదరాబాద్: 2018-19 సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్ను మంత్రి ఈటెల సభలో ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో వరుసగా ఐదో సారి బడ్జెట్ను ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. ఇది ఎన్నికల బడ్జెట్ కాదు...ప్రజాకర్షక బడ్జెట్ అని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించాలనే సీఎం ఆశయానికి అద్దంపడుతూ బడ్జెట్ రూపొందించామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక రాష్ట్ర స్థూలఉత్పత్తిలో గణనీయమైన ప్రగతిని సాధించామన్నారు.
సమైక్య రాష్ట్రంలో 2013-14సంవత్సరంలో 5.4శాతం మాత్రమే ఉన్న జీడీపి వృద్ధి రేటు రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతీయేడు పెరుగుతూ వస్తోందన్నారు. 2016-17లో రాష్ట్ర జీడీపీ వృద్ధి రేటు 10.1శాతంగా నమోదు కాగా, 2017-18లో వృద్ధిరేటు 10.4శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. జాతీయ వృద్ధిరేటుతో పోలిస్తే మన రాష్ట్ర వృద్ధిరేటు మెరుగ్గా ఉండటం ప్రశంసనీయమన్నారు. వ్యవసాయ రంగంలో అభివృద్ధి 2017-18లో 6.9శాతానికి చేరుకుందని మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.
తయారీ రంగంలో 7.5 శాతం వృద్ధి రేటు సాధించామన్నారు. సాగునీరు, నిరంతర విద్యుత్తో వ్యవసాయంలో గణనీయ వృద్ధి సాధించామని చెప్పుకొచ్చారు. వ్యవసాయరంగ వృద్ధి 6.9 శాతంగా ఉందని, తలసరి ఆదాయం రూ.1 లక్ష 75 వేల 534గా మంత్రి ఈటెల తెలిపారు. కొత్త పారిశ్రామిక విధానంతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామన్న మంత్రి ఎకరానికి రూ.4వేల చొప్పున రెండు పంటలకు ఇస్తామని ప్రకటించారు. పెట్టుబడి సాయానికి రూ.12 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa