ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆహారభద్రత, అంత్యోదయకు దరఖాస్తుల ఆహ్వానం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 17, 2018, 09:04 AM

ఆహారభద్రత, అంత్యోదయ కార్డుల కోసం మీసేవ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని పౌరసరఫరాలశాఖ శుక్రవారం సర్క్యులర్ జారీచేసింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారితో పాటు కొత్తగా ఇచ్చేవారి దరఖాస్తులు కూడా స్వీకరించి తదుపరి ప్రక్రియను కొనసాగించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అన్నిజిల్లాల జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. పౌరసరఫరాలశాఖ ప్రక్షాళనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో అతి ముఖ్యమైంది ఈ-పాస్ విధానం. రాష్ట్రవ్యాప్తంగా ఈ-పాస్ సజావుగా అమలవుతుండటంతో ఎక్కడ, ఎంత బియ్యం వినియోగదారులకు చేరుతుందనే వివరాలు పక్కాగా తెలుస్తున్నాయి. ఈ విధానం అమల్లోకి వచ్చాక బియ్యం పెద్దమొత్తంలో ఆదా అవుతున్నది. ప్రతినెలా 12 నుంచి 15 శాతం వరకు బియ్యం మిగులుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. అక్రమాలకు దాదాపుగా తెరపడటంతో కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తులకు ఇక మార్గం సుగమమైంది. ఆకలితో ఏ ఒక్కరు ఉండరాదన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం 85 లక్షలమందికి కార్డులు జారీచేయగా, వీటిద్వారా నెలకు 2.75 కోట్లమంది ప్రయోజనం పొందుతున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa