ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రాంతీయ పార్టీలదే హవా : ఎంపీ వినోద్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 17, 2018, 02:02 PM

రాజన్న సిరిసిల్ల : రాబోయే రోజుల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలదే హవా కొనసాగనుందని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఉపఎన్నికల్లో రెండు రాష్ట్ర పార్టీలు బీఎస్పీ, ఎస్పీ కలిసి పోటీ చేయడంతో జాతీయ పార్టీల అడ్రస్ గల్లంతు అయిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి జాతీయ స్థాయిలో మూడంకెల స్థానాలు రావడం కష్టమన్నారు. 2019 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే పార్లమెంట్‌లో ప్రభావాన్ని చూపుతాయన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులను దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు, అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు. రిజర్వేషన్లపై పార్లమెంట్‌ను పది రోజులు స్తంభింపజేశామని చెప్పారు. వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందించడమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ వినోద్ ఉద్ఘాటించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa