ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓలా, ఊబర్‌ డ్రైవర్లకు నోటీసులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 19, 2018, 11:01 AM

ఓలా, ఊబర్‌ కంపెనీలలో పని చేస్తున్న డ్రైవర్లకు నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. దేశంలోని ప్రధాన నగరాలైన న్యూఢిల్లీ, ముంబయి, బెంగుళూరు, పూణె, హైదరాబాద్‌ వంటి ప్రాంతాలలోని ఓలా, ఊబర్‌ డ్రైవర్లు సోమవారం నుండి నిరవధిక సమ్మెను చేపడుతున్న సంగతి తెలిసిందే. సమ్మెను నిరోధించేందుకు క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ సెక్షన్‌ కింద నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ట్యాక్సీ అగ్రిగేటర్‌ కంపెనీలు తప్పుదారి పట్టించడం వల్ల మొదట వెల్లడించిన దానికన్నా డ్రైవర్లు తక్కువ జీతాలను పొందుతున్నారని తెలిపారు. దీంతో మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో సమ్మెను చేపడుతున్నట్లు తెలిపారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa