ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్యసభ ఎన్నికలపై టీఆర్‌ఎస్ మాక్ పోలింగ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 20, 2018, 10:38 AM

హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికలపై తెలంగాణ భవన్‌లో ఇవాళ టీఆర్‌ఎస్ పార్టీ మాక్ పోలింగ్ నిర్వహించనుంది. ఈ పోలింగ్ నిర్వహణ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు కొనసాగనుంది. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ప్రస్తుతం 90 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉండగా, ఏడుగురు సభ్యులున్న ఎంఐఎం పార్టీ టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తుంది. టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా జోగినపల్లి సంతోష్ కుమార్, బండా ప్రకాశ్ ముదిరాజ్, బడుగుల లింగయ్య యాదవ్ పోటీ చేస్తున్న విషయం విదితమే. ఈ నెల 23న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa