హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులకు అన్ని విధాలా అండగా ఉండటానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ క్రమంలోనే రైతుల కోసం రైతు వేదికల భవనాలను నిర్మిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతీ క్లస్టర్లో రైతు వేదికలు నిర్మిస్తాం. రైతు వేదికల భవనాల కోసం రూ. 300 కోట్లు కేటాయించామని తెలిపారు. 2,638 రైతు వేదికల భవనాలను నిర్మిస్తున్నామని చెప్పారు. ఒక్కో రైతు వేదిక భవనం నిర్మాణానికి రూ. 12 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. 200 నుంచి 300 మంది రైతులు కూర్చోనేలా భవనాలను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఈ భవనాల్లోనే ఏఈవోల ఆఫీసులు ఉండే విధంగా నిర్మాణం చేపడుతామన్నారు. గ్రామంలోనే కాకుండా గ్రామం బయట కూడా ఈ భవనాలను నిర్మించుకోవచ్చు అని సూచించారు. ఇప్పటి వరకు 711 స్థలాలు అందుబాటులోకి వచ్చాయి. స్థలాల ఎంపిక కొనసాగుతోంది. ఈ భవనాలను ఎంత తొందర పూర్తి చేసుకుంటే అంత త్వరగా రైతులకు లాభం కలుగుతుందని మంత్రి పోచారం స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa