ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏఏఐలో జేఈ పోస్టులు... ఏడాదికి 9 లక్షల జీతం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 20, 2018, 11:44 AM

న్యూదిల్లీలోని 'ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)' దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ఖాళీగా ఉన్న జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఇది భారత ప్రభుత్వంలోని పౌర విమానయానశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న మినీరత్న విభాగానికి చెందిన సంస్థ. గేట్-2018 స్కోరు ఆధారంగా జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నరు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తు ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎంపికైనవారికి ఏడాదికి 9 లక్షలు జీతంగా ఇస్తారు.


పోస్టుల వివరాలు....


జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్‌: 542 పోస్టులు


విభాగాల వారీగా ఖాళీలు: సివిల్-100, ఎలక్ట్రికల్-100, ఎలక్ట్రానిక్స్-330, ఆర్కిటెక్చర్-12.


అర్హత‌: 60 శాతం మార్కులతో స‌ంబంధిత విభాగాల్లో బీఈ/ బీటెక్, బ్యాచిల‌ర్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ ఉత్తీర్ణులై ఉండాలి.


వ‌య‌సు: 30.04.2018 నాటికి జనరల్ 27 సంవత్సరాలు; ఓబీసీ 30 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 32 సంవత్సరాలకు మించ‌కూడ‌దు. 


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక‌ విధానం: గేట్‌-2018 స్కోరు ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa