ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి బడ్జెట్‌లో 95 శాతం ఖర్చు చేశాం : ఈటల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 20, 2018, 02:23 PM

హైదరాబాద్ : తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రకటించిన ప్రతి బడ్జెట్‌లో 95 శాతం ఖర్చు చేశామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బడ్జెట్‌పై చర్చకు ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ సమాధానం ఇచ్చారు. తమ ప్రభుత్వమే అప్పులు చేసినట్లు కొందరు విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రతి ప్రభుత్వ హయాంలోనూ అప్పులు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి అప్పు చేయడం తప్పా? అని ఈటల ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందనే ఆశతోనే అప్పులు చేశాం. కానీ కేంద్రం నుంచి తాము ఆశించిన మేరకు నిధులు అందడం లేదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కొత్త రాష్ట్రమైనప్పటికీ అనేక రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇతర రాష్ర్టాల మంత్రులు, అధికారులు.. తెలంగాణ పథకాలపై ప్రశంసలు కురిపించారు. కేంద్రమంత్రులు కూడా రాష్ర్టానికి వచ్చి పథకాలను, ప్రభుత్వ పని విధానాన్ని పరిశీలించిన తర్వాత అభినందించలేకుండా ఉండపోతున్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడం, వ్యతిరేకించడం సరికాదన్నారు. అధికారపక్షం తప్పు చేస్తే చెప్పండి అని సూచించారు. ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ చెప్పడం బాధాకరమని ఈటల రాజేందర్ అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa