కోల్కతా: టీమిండియా పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని మార్చి 23న కలవనుంది. తన భర్త షమీపై చేసిన ఆరోపణలకు సంబంధించి ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా కలిసి వివరించాలనుకుంటున్నానని, ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ అపాయింట్మెంట్ కావాలని కోరినట్లు హసీన్ వెల్లడించిన విషయం తెలిసిందే. హసీన్ అభ్యర్థనను పరిశీలించిన సీఎం తనతో సమావేశానికి తాజాగా అనుమతిని ఇచ్చారు. షమీ తనను వేధిస్తున్నాడని, అతనికి అక్రమ సంబంధాలున్నాయని, మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడని జహాన్ ఆరోపణలు చేయడంతో దేశవ్యాప్తంగా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. షమీపై కోల్కతా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమె ఆరోపణలపై విచారణ కూడా చేపట్టిన విషయం తెలిసిందే. ఐతే ముఖ్యమంత్రిని కలిసి వాస్తవాలను ఆమె దృష్టికి తీసుకెళ్లాలని హసీన్ భావిస్తోంది. సమావేశం అనంతరం ఈ కథ మరెన్నో మలుపులు తిరగనుందోనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa