హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బిడ్డ అని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శాసనసభలో మంత్రి మాట్లాడుతూ… రైతుల సమస్యలకు సీఎం కేసీఆర్ పరిష్కారం చూపుతున్నారన్నారు. రైతులకు రెండు పంటలకు నీరిచ్చేందుకు ప్రభుత్వం అహర్నిషలు శ్రమిస్తోందన్నారు. మిషన్ కాకతీయతో చెరువులను బాగు చేశామన్నారు. రైతులకు పంట పెట్టుబడి చెక్కుల రూపంలో అందిస్తామని మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. రైతు సమన్వయ సమితిలో లక్షా 61వేల మంది సభ్యులను నియమించామన్నారు. 2,638 రైతు వేదిక భవనాలను నిర్మిస్తామన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులను అందిస్తున్నామని పేర్కొన్నారు. పార్ట్-ఎలో భాగంగా వివాదరహిత భూముల సర్వే పూర్తి చేశామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa