ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతుల సంక్షేమం కోసమే సమన్వయ సమితులు: పోచారం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 22, 2018, 11:26 AM

హైదరాబాద్: అసంఘటితంగా ఉన్న రైతులను సంఘటితం చేసేందుకు అదేవిధంగా రైతులందరి సంక్షేమం కోసమే ప్రభుత్వం రైతు సమన్వయ సమితులను ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల్లో భాగంగా సభ్యులు వీరేశం, జలగం వెంకట్రావ్, కిషన్‌రెడ్డి, ప్రభాకర్‌లు రైతు సమన్వయ సమితుల ఏర్పాటు, పనితీరు తదితరాలపై ప్రశ్నలడిగారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. గత ప్రభుత్వ హాయాంలో అనుచరులు ఆదర్శరైతులే.. ఆటో డ్రైవరూ ఆదర్శరైతే.. ఎద్దు లేదు.. ఎవుసం లేదు అయినా ఆదర్శరైతే. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో అసలు సిసలైన రైతులకే రైతు సమన్వయ సమితుల్లో అవకాశం కల్పించామన్నారు. భూమి ఉన్నవారికి మాత్రమే రైతు సమన్వయ కమిటీలో స్థానం కల్పించినట్లు తెలిపారు. గ్రామ రైతు సమన్వయ కమిటీలో 15 మంది రైతులు అందులో 1/3వ వంతు మహిళలకు చోటు కల్పించినట్లు వెల్లడించారు. ఇదే రీతిలో మండలస్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో కమిటీల ఏర్పాటు జరిగిందన్నారు. వీరిలో అన్ని కులాలు, అన్ని మతాల వారికి చోటు కల్పించినట్లు చెప్పారు. మొత్తం లక్షా 61 వేల మంది రైతు సమన్వయ సమితిలో సభ్యులుగా ఉన్నారన్నారు.  ప్రాంతీయ రైతుల సమన్వయ సమితి సమావేశంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ కమిటీ సభ్యుల పాత్ర, విధులు, బాధ్యతలపై సుదీర్ఘంగా వివరించారు. అనుమానాలు, సందేహాలు ఉంటే పింక్ కలర్ స్లిప్ ద్వారా.. సలహాలను గ్రీన్ కలర్ స్లిప్ ద్వారా స్వీకరించాం. కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా.. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు ఒకవేళ ఏ పంటయైన అమ్ముడు పోని పక్షంలో ఆ పంటను రైతు సమన్వయ సమితులే కొనే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మంచి వంగడాలు అందించడం, పెట్టుబడి సాయం, దళారి వ్యవస్థను రూపుమాపడమే లక్ష్యంగా రైతు సమన్వయ సమితులు పనిచేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa