నేటి ఈ జనరేషన్లో ఫేస్బుక్ అంటే తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఫేస్బుక్ అలా మనిషి రక్తంలో కలిసిపోయింది. ఇక.. గత కొన్ని రోజుల నుంచి ఫేస్బుక్పై డేటా చౌర్యంపై ఆరోపణలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. లండన్కు చెందిన కేంబ్రిడ్జి అనలిటికా అనే రీసెర్చ్ కంపెనీ... ఫేస్బుక్ యూజర్ల డేటాను తస్కరించి యూఎస్ ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం ఉపయోగించందనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై సర్వత్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై భారత్ కూడా తనదైన శైలిలో స్పందించింది. భారత్కు చెందిన యూజర్ల డేటాను కూడా ఫేస్బుక్ చౌర్యం చేసిందని తెలిస్తే గనుక.. ఖచ్చితంగా ఫేస్బుక్ ఫౌండర్ జుకర్బర్గ్కు సమన్లు జారీ చేయడానికి కూడా వెనుకాడబోమని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం హెచ్చరించారు.
ఇక.. ఈ ఆరోపణల నేపథ్యంలో ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్ స్పందించారు. తన ఫేస్బుక్ ఖాతాలో ఫేస్బుక్ అకౌంట్ హోల్డర్లకు సవివరణ ఇచ్చారు. తర్వాత ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ కేంబ్రిడ్జి అనలిటికాపై మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే.... "కేంబ్రిడ్జి అనలిటికా గురించి నేను కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ఘటనపై మేము ఇదివరకే తీసుకున్న స్టెప్స్, భవిష్యత్తులో తీసుకోబోయే కార్యచరణ గురించి చెప్పాలనుకుంటున్నాను.
మీ డేటాను కాపాడాల్సిన బాధ్యత మాదే. ఒకవేళ ఏ కారణం చేతనైనా మీ డేటాను మేము కాపాడలేకపోతే.. మేము ఈ పొజిషన్లో ఉండటం వేస్ట్. మాకు ఆ అర్హత కూడా లేదు. డేటా చౌర్యం ఎలా జరిగిందో తెలుసుకోవడం కోసం నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. భవిష్యత్తులో ఇది జరగకుండా ఉండటానికి కూడా నేను చర్యలు తీసుకుంటాను. ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు కొన్ని సంవత్సరాల క్రితమే మేం చేయాల్సిన పనులను చేశాం. దురదృష్టవశాత్తు ఏదైతే జరగకూడదనుకున్నామో.. అదే జరిగింది. మేం తప్పు చేశాం. మమ్మల్ని క్షమించండి.. కాని ఇంకా చేయాల్సింది చాలా ఉంది.." అని ఆయన వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa