ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు కృషి: మహేందర్‌రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 22, 2018, 12:31 PM

హైదరాబాద్: ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలపై మంత్రి స్పందిస్తూ.. టీఎస్‌ఆర్టీసీకి 1,474 ఎకరాల భూమి ఉందని తెలిపారు. ఆర్టీసీ స్థలాల్లో పెట్రోల్ బంక్‌లను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ఖమ్మం, కరీంనగర్ బస్టాండ్లలో మినీ థియేటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 1100 కొత్త బస్సులు తీసుకున్నట్లు తెలిపారు. ఏపీకి ప్రస్తుతం 180 బస్సులు నడుపుతున్నట్లు త్వరలో మరో 150 బస్సులు నడుపనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa