కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్ వరకు నడిచే గౌతమి ఎక్స్ప్రెస్(12775)ను ఏప్రిల్ 8వ తేదీ నుంచి లింగంపల్లి వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఏప్రిల్ 8న కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి 9న లింగంపల్లికి చేరుకుంటుందని అన్నారు. ఈ రైలు ప్రతిరోజు నడుస్తుందని చెప్పారు. హైటెక్ సిటీ, జేఎన్టీయూ వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుందని రైల్వే అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa