బీజేపీకి ఆ పార్టీ ఐటీ సెల్ వ్యవస్థాపకుడు షాకిచ్చారు. పార్టీలో నేను ఉండలేను బాబోయ్ అంటూ గుడ్ బై చెప్పేసి వెళ్లిపోయారు. పార్టీ జాతీయ కార్యవర్గ కమిటీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన పార్టీకి గుడ్ బై చెబుతూ రాసిన జీనామా లేఖ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ లేఖలో ప్రధాని, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాపై విరుచుకుపడ్డారు. పార్టీలో, ప్రభుత్వంలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడం చాలా బాధించింది... మిగిలిన పార్టీలకు బీజేపీకి తేడా లేకుండా పోయిందన్నారు ప్రద్యుత్ బోరా. పార్టీకి అధికారం పిచ్చి బాగా ముదిరిందని... ఎలాగైనా గెలిచి తీరాలన్న ఉద్దేశంతో విలువల్ని తుంగలో తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
2004లో తాను పార్టీకి... ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయన్నారు. పార్టీ విధానాలతో బీజేపీపై తనకు నమ్మకం పోయిందని... ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా ప్రత్యామ్నాయ రాజకీయాలు అవసరమన్నారు. దీనికి బీజేపీ కూడా మినహాయింపు కాదన్నారు. ప్రజలు కూడా ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారని బోరా అభిప్రాయపడ్డారు. తనకు గతంలోనే కాంగ్రెస్తో పాటూ ఎన్నో పార్టీల నుంచి ఆఫర్లు వచ్చాయని... తాను మాత్రం లొంగలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా పనితీరుపై చాలామంది నుంచి ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. ఈయన సోషల్ మీడియా ద్వారా బీజేపీని విస్తరించేందుకు ఐటీ సెల్ ద్వారా కీలక పాత్ర పోషించారు. అలాంటి వ్యక్తి పార్టీని వీడటం పార్టీకి నష్టమేనని చెప్పాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa