ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసెంబ్లీ పరిసరాల్లో భద్రత పెంపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 23, 2018, 10:02 AM

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇప్పటికే కొనసాగిస్తున్న భద్రతను పోలీసు అధికారులు పెంచారు. అసెంబ్లీ పరిసరాల్లో నేడు పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ఓ వైపు రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరుగుతుండటం మరోవైపు అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు భద్రతను పటిష్ఠం చేశారు. రైతు సమస్యలపై బీజేపీ ఛలో అసెంబ్లీలో పిలుపునిచ్చింది. రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌కు టీఆర్‌ఎస్ ప్రతినిధిగా రమేశ్‌రెడ్డి వ్యవహరిస్తుండగా కాంగ్రెస్ తరపు ప్రతినిధిగా రేగా కాంతారావు ఉన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులైన సంతోష్ కుమార్ ఏజెంట్‌గా గట్టు రామచంద్రరావు, బండా ప్రకాశ్ ఏజెంట్‌గా శ్రవణ్ రెడ్డి, లింగయ్య యాదవ్ ఏజెంట్‌గా రాజేశ్ వ్యవహరిస్తుండగా కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ఏజెంట్లుగా కోదండరెడ్డి, సీతక్క, మల్లు రవి ఉన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa