ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజన్న ఆలయంలో అపశృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 26, 2018, 10:31 AM

  వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. కోడెలు తొక్కడంతో మనీష్‌ (3) అనే బాలుడు దుర్మరణం చెందాడు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లికి చెందిన ఓ కుటుంబం శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధికి వచ్చారు. వేడుకలు ముగిసిన అనంతరం ఆలయ ప్రాంగణంలోనే నిద్రించారు. అక్కడే తిరుగుతున్న కోడెలు ఒక్కసారిగా ప‌రుగులు పెట్టాయి. నిద్రిస్తున్న భక్తులపై పరుగులు తీశాయి. కోడెలు తొక్కడంతో మనీష్‌ అనే మూడేళ్ల బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. మరికొంతమంది భక్తులు గాయపడ్డారు. బాలుడి మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa