తిరువనంతపురం : మానవత్వం మంట కలుస్తోంది అనడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ. వివరాల్లోకి వెళితే మార్చి 20న ఓవ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని మొదట కేరళలోని పాలక్కాడ్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించడానికి ప్రైవేటు అంబులెన్స్లో తీసుకువెళుతుండగా, గాయపడిన వ్యక్తి అంబులెన్స్లో మూత్రం పోశాడని కేరళలోని త్రిశూర్ మెడికల్ కాలేజి ఆసుపత్రి వెలుపల స్ట్రెచర్పై ఉంచి వెళ్లిపోయారు. ఈ సన్నివేశాన్ని ప్రత్యక్ష సాక్షి తన మొబైల్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి పట్ల నిర్లక్ష్యం వహించినందుకు డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులు పాలక్కాడ్ ఆసుపత్రి సిబ్బంది సహాయంతో ఆ వ్యక్తిని త్రిశూల్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa