ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశ ప్రజలపై గూఢచర్యం చేస్తున్న మోడీ : రాహుల్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 26, 2018, 02:35 PM

న్యూఢిల్లి : ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలపై గూఢచర్యానికి పాల్పడుతున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. మోడీ బిగ్‌బాస్‌ అంటూ రాహుల్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌, బిజెపిల మధ్య ప్రారంభమైన డేటా లీకేజ్‌ యుద్ధం పతాకస్థాయికి చేరుకుంది. రాహుల్‌ ఆరోపణలపై స్పందించిన బిజెపి నేతలు రాహుల్‌కు టెక్నాలజి గురించి ఏమీ తెలియదని అన్నారు. కాంగ్రెస్‌ యాప్‌నుంచే డేటా లీక్‌ అవుతోందని వారు ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ తన అధికారిక యాప్‌ను తొలగించింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa