కర్ణాటక రాష్ట్రంలో ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకోనుందా. ? అంటే అవునంటోంది ఒక ఎన్నికల సర్వే. దాని ప్రకారం కాంగ్రెస్ అధికారం చేజిక్కుంచుకోవడానికి అవసరమైన సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. ప్రముఖ సర్వే సంస్థ సీ-ఫోర్స్ ఈ సర్వేను నిర్వహించింది. మార్చి 1 నుంచి 25మధ్య 154 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు. దీని ప్రకారం కాంగ్రెస్ మునుపటి కంటే బాగా మరో 9% ఓట్ల శాతాన్ని పెంచుకుని పోలైన ఓట్లలో 46% వాటాను చేజిక్కుంచుకోనున్నట్లు సర్వే తేల్చింది. అయితే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీకి పెద్దగా ఓట్ల డ్యామేజ్ ఉండేటట్లు కనబడటం లేదు.
సర్వే వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొత్తం ఓట్లలో 46% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి, 31 శాతం ఓట్లు బీజేపీకి, 16% ఓట్లు జేడీఎస్ పార్టీకి దక్కనున్నాయని అంచనా వేశారు. ఓట్ల శాతం వారీగా నియోజకవర్గాల వారీగా గమనిస్తే కాంగ్రెస్ ఈసారి 126 సీట్లు గెలవగలదు. సీఫోర్స్ గతంలో 2013లో నిర్వహించిన సర్వేలో సైతం కాంగ్రెస్ 119-120 సీట్లు గెలుస్తుందని చెప్పింది. ఫలితాలు వచ్చేసరికి కాంగ్రెస్ 122 సీట్లలో విజయం సాధించింది.
కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 126 సీట్లు, బీజేపీ కొద్దిగా పుంజుకుని 70 సీట్లలో పాగా వేయగలవని సర్వే తెలిపింది. అయితే జేడీఎస్ పార్టీ దెబ్బతినడం వల్లనే కాంగ్రెస్, బీజేపీ పుంజుకుంటాయని ఎక్కువ మంది ఓటర్లు అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. 2013లో 40 సీట్లలో గెలిచిన జేడీఎస్ ఈసారి క్రియాశీలకంగా వ్యవహరించకపోవడం వల్ల 27 సీట్లలో మాత్రమే గెలవొచ్చని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa