ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేను బాగానే ఉన్నా.. వాటిని నమ్మకండి: గోవా సీఎం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 26, 2018, 03:26 PM

తన ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మకవద్దని ఫేస్‌బుక్ ద్వారా గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ విఙ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న పారికర్‌కు సోమవారం రెండో దశ చికిత్స ప్రారంభమవుతుంది. పారికర్ ఆరోగ్యంగా ఉన్నారని గోవా స్పీకర్ ప్రమోద్ సావంత్ ఆదివారం సాయంత్రం పేర్కొన్నారు. ఆయనకు రెండో దశ చికిత్స మూడు రోజులు కొనసాగనుందని, రెండు వారాల తర్వాత డిశ్చార్జ్ అయ్యాక, అనంతరం గోవాకు చేరుకుంటారని స్పీకర్ తెలిపారు. మనోహర్ పారికర్ ఆరోగ్యం గురించి ఆదివారం సామాజిక మాధ్యమాల్లో అనేక రూమర్లు చక్కర్లు కొట్టాయి. వీటిని గోవా సీఎంఓ ప్రచురించినట్టు కూడా ప్రచారం జరిగింది.


‘ఇలాంటి ప్రచారం దురదృష్టకరమని, ఒకవేళ ఏదైనా ఉంటే నేరుగా పారికర్ తెలియజేస్తారని స్పీకర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చికిత్స కోసం అమెరికాలో ఉన్న గోవా సీఎం స్థానంలో ముగ్గురు క్యాబినెట్ మంత్రుల బృందం పాలన సాగిస్తోందని, ఎలాంటి సమస్యలు లేవని స్పీకర్ సావంత్ అన్నారు. మరోవైపు మనోహర్ పారికర్ ఆరోగ్యంగానే ఉన్నారని, చికిత్స సక్రమంగా సాగుతోందని కేంద్ర వాణిజ్య, పారిశ్రామిక శాఖ మంత్రి సురేశ్ ప్రభు శనివారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. త్వరగా కోలుకుని, తిరిగివచి, మళ్లీ యధావిధిగా బాధ్యతలు చేపడతారని సురేశ్ ప్రభు అన్నారు. 


ఈ ఏడాది ఫిబ్రవరి అస్వస్థతకు గురైన గోవా సీఎం వైద్యం కోసం తొలిసారిగా ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో చేరారు. ప్యాక్రియాటైటీస్‌తో పారికర్ బాధపడుతోన్న లీలావతి హాస్పిటల్ వైద్యులు గుర్తించారు. అక్కడ వారం రోజుల చికిత్స తర్వాత ఫిబ్రవరి 21 న గోవాకు తిరిగొచ్చారు. అయితే రెండు రోజుల తర్వాత మళ్లీ గోవా మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో చేరారు. మార్చి 5 న మరోసారి ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో చేరిన పారికర్, అక్కడ వైద్యుల సూచనలతో వైద్యం కోసం అమెరికా వెళ్లారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa