ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాలకు.. చైనా స్పేస్‌ల్యాబ్ గండం?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 27, 2018, 09:10 AM

తెలుగు రాష్ట్రాలకు చైనా గండం పొంచివుందా? అంతరిక్షంలో గతి తప్పిన చైనా ల్యాబ్ టియాంగోన్గ్-1 ఇండియాలో కూలేందుకు అవకాశాలున్నాయా? ఇందుకు ఖగోళ నిపుణులు కచ్చితంగా సమాధానం చెప్పలేకున్నా.. అది మన నడి నెత్తిపైనే తిరుగుతున్న మాట వాస్తవమేనని తెలుపుతున్నారు. ప్రస్తుతం భూమిచుట్టూ తిరుగుతున్న ఈ స్పేస్‌ల్యాబ్ దిశ మార్చుకుంది.


ఇంకా భూ వాతావరణంలోకి ప్రవేశించని ఈ స్కైల్యాబ్ ఇప్పటివరకు ఉత్తర చైనా, ఇటలీ, ఉత్తర స్పెయిన్, మిడిల్ ఈస్ట్, న్యూజిలాండ్, తస్మానియా, దక్షిణ, ఉత్తర అమెరికా, దక్షిణాఫ్రికా మీదుగా సాగిన స్పేస్ ల్యాబ్ ప్రాంతాలు మీదుగా సంచరించింది. రెండు రోజుల నుంచి దీని దిశలో మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు అది ఇండియాలోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా ప్రయాణిస్తోంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఉత్తర, దక్షిణా అమెరికా మీదుగా సాగుతోంది. ఇది ఏప్రిల్ 1, లేదా 2వ తేదీల్లో భూమిపై కూలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని గమనాన్ని శాట్‌వ్యూ అనే ఉపగ్రహ ట్రాకింగ్ వెబ్‌సైట్ గమనిస్తోంది. 2016లో అంతరిక్షంలో నియంత్రణ కోల్పోయిన గత కొన్నాళ్లుగా కక్ష్యలో తిరుగుతూ ఈ ఏడాది భూమి వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం గంటకు 27,998 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతోంది. 8.5 టన్నుల బరువుండే ఈ స్పేస్ ల్యాబ్ శకలాలు జనావాసాలపై కూలితే పరిస్థితి ఎలా ఉంటుందనే ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఇది భూమికి 211 కిమీల ఎత్తులో ప్రయాణిస్తోంది. 120 కిమీలకు చేరగానే భూవాతావరణంలోకి ప్రవేశిస్తుంది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa