ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ ట్వీట్‌పై ఎన్నికల సంఘం సీరియస్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 27, 2018, 02:32 PM

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకుండానే... బీజేపీకి ముందే సమాచారం అందిందన్న ఆరోపణలపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇవాళ ఎన్నికల సంఘానికంటే ముందే బీజేపీ ఐటీసెల్ చీఫ్ అమిత్ మాలవీయ తేదీలతో సహా ట్విటర్లో వెల్లడించారు. ఎన్నికల సంఘం నిర్వహించిన మీడియా సమావేశంలో ఇదే అంశంపై వాడివేడి సంభాషణ జరిగింది. ఈసీ అధికారికంగా ప్రకటించక ముందే మాలవీయకు తేదీలెలా తెలిశాయంటూ... మీడియా ప్రతినిధులు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్‌ను ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ... ‘‘దీన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నాం. వెంటనే దీనిపై పూర్తి విచారణ జరిపి ఎక్కడ పొరపాటు జరిగిందో తేలుస్తాం. వారివద్ద ఏమేమి సమాచారం ఉందనే దానిపై ఊహాగానాలు అనవసరం. ఎన్నికల సంఘం ద్వారా ఏదైనా తప్పు జరిగినట్టు తేలితే తీవ్ర చర్యలు తీసుకుంటాం. చట్టపరమైన, పరిపాలన పరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోము’’ అని స్పష్టం చేశారు.


 అయితే తాజాగా ఘటన వివాదం రేపినప్పటికీ ఎన్నికల షెడ్యూల్‌పై ఈసీ యథావిధిగా ముందుకెళ్లింది. దాదాపు మాలవీయ ప్రకటించిన తేదీలకు అటుఇటుగానే ఈసీ షెడ్యూల్ ప్రకటించినప్పటికీ.. ఓట్ల లెక్కింపు తేదీ మాత్రం వేరేగా ఉంది. మే 18న ఓట్ల లెక్కింపు ఉంటుందని మాలవీయ పేర్కొనగా మే15నే ఫలితాలు వెల్లడించనున్నట్టు ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 17న నోటిఫికేషన్ విడుదల చేస్తామనీ... 24 తేదీలోపు నామినేషన్లు స్వీకరించనున్నట్టు ప్రకటించింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa