ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అచలేశ్వరాలయంలో 'మహా'ద్భుత శివలింగం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 28, 2018, 12:11 PM

దేశంలో ఉన్న పురాతన శివాలయాల్లో రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఉన్న'అచలేశ్వర మహాదేవ మందిరం' ఒకటి. దీనికి దాదాపు 2500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడి గర్భగుడిలోని శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివలింగం రోజులో మూడుసార్లు.. రంగులు మారుతూ... అందర్నీ.. ఆశ్చర్యపరుస్తోంది. ఉదయం ఎరుపు వర్ణంలో, మధ్యాహ్నం కాషాయ రంగులో దర్శనమిస్తుంది. సాయంత్రం కాగానే ఈ శివలింగం నలుపు రంగులోకి మారిపోతుంది. దీనికితోడు ఈ శివలింగం పక్కకు కదులుతుంటుంది. ఈ విచిత్ర శివలింగాన్ని దర్శించుకునేందుకు... భక్తులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌స్తుంటారు. 


ఇక్కడి శివాలయంలో ఇత్తడితో తయారుచేసిన 'నంది' మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పంచలోహాలతో దీన్ని తయారు చేశారు. ఈ శివలింగం ఇలా రంగులు మారుతూ, కదలడానికి గాల కారణాలను తెలుసుకునేందుకు పురాతత్వ శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినప్పటికీ... ఫలితం సాధించలేకపోయారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa