ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ రహదారులపై టోల్ బాదుడు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 31, 2018, 02:25 PM

జాతీయ రహదారులపై వెళ్తున్నారా.. అయితే ఇకపై మీకు మరింత బాదుడు తప్పదు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా నేషనల్ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) జాతీయ రహదారులపై టోల్‌ రేట్లను 5 నుంచి 7శాతం సవరించింది. దీని ప్రకారం.. టోల్‌ రేట్లు పెరగనున్నట్లు ట్రాన్స్‌పోర్టర్లు చెబుతున్నారు.


రేట్ల పెంపుపై నేషనల్‌ హైవే-2 ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ మహ్మద్‌ సఫీ ఓ మీడియాతో మాట్లాడారు. ‘దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై 372 టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో టోల్‌ రేట్లను సవరిస్తాం. టోకు ధరల సూచీ ఆధారంగా ఈ రేట్లను సవరిస్తాం. ఇవి ఒక్కో టోల్‌ ప్లాజాకు ఒక్కో రకంగా ఉంటాయి. నేషనల్‌ హైవే-2పై టోల్‌ ధరలను ఈ సారి 5శాతం పెంచాం’ అని తెలిపారు.


పెంచిన ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. చాలా ప్లాజాల్లో 5శాతం పెరగగా.. కొన్ని చోట్ల 7శాతం వరకు పెరిగాయి. నెలవారీ టోల్‌ పాస్‌లపై కూడా ధరలు పెరిగాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa