ఆస్ట్రేలియా వేదికగా బుధవారం నుంచే కామన్వెల్త్ గేమ్స్ 2018 ప్రారంభంకానున్నాయి. మొత్తం 71 దేశాలు ఈ మెగా ఈవెంట్లో పోటీపడుతుండగా.. భారత్ నుంచి 218 మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకి గోల్డ్కోస్ట్లోని కరారా స్టేడియంలో జరగనున్న ఆరంభోత్సవంలో స్టార్ షట్లర్ పీవీ సింధు జాతీయ జెండాతో భారత బృందానికి నాయకత్వం వహించనుంది. గురువారం సాయంత్రం నుంచి ప్రధాన పోటీలు ప్రారంభంకానున్నాయి. అన్ని దేశాల నుంచి దాదాపు 6,600 మంది అథ్లెట్లు పోటీపడుతున్నట్లు సమాచారం.
కామన్వెల్త్ క్రీడల్లో 1934 నుంచి భారత్ పాల్గొంటోంది. ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్లో భారత్ 438 పతకాలు గెలుపొందగా.. ఇందులో 155 స్వర్ణాలు, 155 రజతాలు, 128 కాంస్య పతకాలు ఉన్నాయి. 2014లో జరిగిన గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత జట్టు 15 స్వర్ణాలు గెలుపొంది పతకాల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. ఈసారి ఈ పతకాల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఇటీవల క్రీడాగ్రామంలో బాక్సర్ల గదుల సమీపంలో సిరంజీలు దొరకడం.. ఆపై విచారణలో భారత బాక్సర్లు ఎలాంటి తప్పూ చేయలేదని తేలడం ఇప్పుడు బృందం ఉత్సాహంగా ఉంది. ఒలింపిక్స్, ఆసియా క్రీడలతో పోలిస్తే.. కామన్వెల్త్లో భారత్ ఆది నుంచే మెరుగైన ప్రదర్శనతో పతకాల పంట పండిస్తోంది. సంఖ్యాపరంగా తీసుకుంటే ఇవి 21వ కామన్వెల్త్ గేమ్స్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa