హైదరాబాద్: సంఘసంస్కర్త, కుల వివక్షపై పోరాడిన యోధుడు మహాత్మా జ్యోతిబాపూలే 192వ జయంతి నేడు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రవీంద్రభారతిలో ఈ ఉదయం ప్రత్యేక కార్యక్రమాలు, సభ జరుగుతుంది. ఈ ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షలు ప్రత్యేకంగా మంజూరుచేసింది. పూలే జయంతి ఉత్సవ కమిటీకి చైర్మన్గా బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగురామన్న వ్యవహరిస్తారు. ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్పర్సన్గా గడ్డం సాయికిరణ్ను ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ప్రభుత్వమే పూలే జయంతి ఉత్సవాలను నిర్వహించడం పట్ల బీసీ, ఎంబీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.