హైదరాబాద్ : తెలంగాణ వాగ్గేయకారుడు భక్త రామదాసు కీర్తనలను గ్రామ, గ్రామానికి చేరవేసే విధంగా స్వామి చినజీయర్ మంగళ శాసనాలతో నల్లకుంట నుంచి భద్రాచలానికి పాదయాత్ర చేయనున్నామని సంగీత కళాకారుడు యరగొల్ల శ్రీనివాస్యాదవ్, శ్రీగగీగౌరీశ్వర భజన మండలి అధ్యక్షుడు పూన నర్సింహ తెలిపారు. నేడు ఉదయం 9 గంటలకు స్థానిక ఓల్డ్ రామాలయం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఈ పాదయాత్ర నిరన్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 21 వరకు భద్రాచలం చేరుకుంటామని తెలిపారు.