హైదరాబాద్ : మాదాపూర్ న్యాక్లో జాగ్వార్ కంపెనీ సహకారంతో కొత్తగా ఏర్పాటు చేసిన ప్లంబింగ్ అండ్ శానిటేషన్ ల్యాబ్ను రోడ్లు, భవనాల శాఖ మంత్రి హరీష్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. న్యాక్ను ఉత్పాదక కంపెనీగా తీర్చిదిద్దారు అని తెలిపారు. న్యాక్కు ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. న్యాక్ ఉద్యోగుల జీతాలు పెంపునకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. జాగ్వార్ కంపెనీ ఆధ్వర్యంలో ల్యాబ్ ఏర్పాటు చేయడం మంచి పరిణామం అని మంత్రి తుమ్మల అన్నారు.