హైదరాబాద్ : గంజాయి, ఇసుక మాఫియాకు ఎమ్మెల్యే రెడ్యా నాయక్ పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఖండించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. రెడ్యానాయక్పై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి తెలంగాణలో జరుగుతుందన్నారు. కాంగ్రెస్ నేతలు గిరిజనుల అభివృద్ధిని పట్టించుకోలేదని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తండాలను గ్రామపంచాయతీలుగా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ బస్సు యాత్రకు ప్రజా స్పందన లేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ను గెలిపిస్తాయని రాముల్ నాయక్ స్పష్టం చేశారు.