హైదరాబాద్: మంత్రి కేటీఆర్తో ఆస్ట్రేలియా ప్రతినిధులు భేటీ అయ్యారు. కేటీఆర్తో సమావేశంలో ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ సుసాన్ గ్రేస్, ట్రేడ్ కమిషనర్ మునీష్శర్మలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూలత వాతావరణాన్ని మంత్రి కేటీఆర్ ప్రతినిధులకు వివరించారు. మౌలిక వసతులు, క్రీడలు, ఐటీ రంగాల్లో ఆస్ట్రేలియా కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని కేటీఆర్ కోరారు. మహిళా వ్యాపారవేత్తల కోసం వి-హబ్ ఏర్పాటు చేసినందుకు మంత్రి కేటీఆర్ను అభినందించిన సుసాన్గ్రేస్ టీ-హబ్ లాంటి కార్యక్రమాలు ఆవిష్కరణలకు ఊతమిస్తాయన్నారు.