సినీ నటుడు, జనసేనాని పవన్ కల్యాణ్పై నటి శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై ఇటీవల పవన్ ట్విటర్ ద్వారా స్పందించారు. అనవసరంగా టీఆర్పీల కోసం తన తల్లిని తిట్టారంటూ ఆయన బాధపడ్డారు. ఆ తర్వాత తన కుటుంబంతో కలిసి ఫిలిం ఛాంబర్లో నిరసనకు దిగారు.తాజాగా పవన్ వరుస ట్వీట్లు పెడుతున్నారు. తన తల్లిని దూషించిన వారు రహస్యంగా క్షమాపణలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పబ్లిక్లో నోటికొచ్చినట్లు తిట్టారు. ప్రైవేట్గా క్షమాపణలు చెబుతున్నారు. ఇలాంటివి నా దగ్గర కుదరవు. గత ఆరు నెలలుగా నన్ను, నా తల్లిని, అభిమానులను, అనుచరులను నోటికొచ్చినట్లు తిట్టారు. ఇంతటి నీచ బుద్ధి ఉన్న మీరు ఇప్పుడు రహస్యంగా క్షమాపణలు చెప్తారా? మనల్ని, మన తల్లుల్ని, ఆడపడుచులన్ని తిట్టే పేపర్లు ఎందుకు చదవాలి? వాళ్ల టీవీలు ఎందుకు చూడాలి? జర్నలిజం విలువలతో ఉన్న ఛానెల్స్, పత్రికలకు మద్దతిస్తాం. త్వరలోనే తెలుగు చిత్ర పరిశ్రమ ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితి ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది. వీరికి జనసేన ‘వీరమహిళ’ విభాగం అండగా ఉంటుంది’ అని పేర్కొన్నారు పవన్.