సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు పారిశ్రామికవాడలో గల అగర్వాల్ రబ్బరు పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమ నుంచి భారీగా పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి. మంటలు తీవ్రంగా ఎగసిపడుతున్నాయి. కిలోమీటరు మేర దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకుని ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు.