ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముగ్గురు ఫార్మసీ విద్యార్థినీలు అదృశ్యం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 26, 2018, 08:55 AM

కాచిగూడ : కళాశాలకు వెళ్లి వస్తామని ఇంట్లోంచి వెళ్లిన ముగ్గురు ఫార్మసీ విద్యార్థినీలు అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ కె.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం న్యూ మలక్‌పేట, జడ్జెస్ కాలనీ, ఎక్స్‌లెన్సీ అపార్ట్‌మెంట్‌కు చెందిన అబిబోద్దిన్ కుమార్తె అమీనా అబిబ్(19), బహదూర్‌పుర, శాస్త్రీపురం, కీంగ్స్ కాలనీకి చెందిన మహ్మద్ వాసీం కుమార్తె షభా మనర్(19), మీర్‌చౌక్, అలిజాకోట్ల ప్రాంతానికి చెందిన మహ్మద్ నజిమోద్దిన్ కుమార్తె మదియా ఉన్నీసా(18) ఈ ముగ్గురు విద్యార్థినీలు బర్కత్‌పురలోని ఆర్.బీ.వి.ఆర్.ఆర్ కళాశాలలో ఫార్మాసీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. రోజువారి మాదిరిగానే ఉదయం కళాశాలకు వెళ్లి వస్తామనికుంటుంబ సభ్యులకు చెప్పిన యువతులు రాత్రి వరకు రాకపోవడంతో కలత చెందిన కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు బంధువుల, చుట్టుపక్కల, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకి లభించకపోవడంతో అమీనా అబిబ్ తండ్రి అబిబోద్దిన్ కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అదృశ్యమైన ముగ్గురు ఫార్మాసీ విద్యార్థినీలు అదృశ్యమా... కిడ్నాపా అనే కోణంలో కాచిగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముగ్గురు యువతులు మంగళవారం రైల్లో ముంబాయికి వెళ్లినట్లు అమీనా అబిబ్, షభా మనర్, మదియా ఉన్నీసా స్నేహితుల ద్వారా సమాచారం తెలిసినట్లు పోలీసులు తెలిపారు. అబిబోద్దిన్ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వి.లక్ష్మయ్య తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com