కర్ణాటక ఎన్నికల పుణ్యమా అని 19 రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం పెరిగాయి. ఎన్నికలు ముగిసిన రెండో రోజే ధర పెరగడం గమనార్హం. పెట్రోల్ లీటర్కు 17 పైసలు, డీజిల్ లీటర్కు 21 పైసలు పెరిగాయి. హైదరాబాద్ విషయానికి వస్తే డీజిల్పై ఈ పెంపు 26 పైసలుగా, పెట్రోల్పై 19 పైసలుగా ఉంది. సోమవారం పెట్రోల్ లీటర్ ధర రూ.79.23కు చేరగా.. డీజిల్ ధర రూ.71.89గా ఉంది. కర్ణాటక ఎన్నికల కారణంగానే 20 రోజులుగా పెట్రో ధరలు పెంచడం లేదన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అయితే ఇప్పుడు ఎన్నికలు ముగియగానే ధరలు పెరగడం చూస్తే ఆ వార్తలే నిజమని స్పష్టమవుతున్నది.
గుజరాత్ ఎన్నికల సమయంలోనూ ప్రతి రోజూ ధరలను 1 నుంచి 3 పైసల వరకు తగ్గిస్తూ వచ్చారు. ఎన్నికలు డిసెంబర్ 14న పూర్తవగానే ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు కర్ణాటక ఎన్నికలు ముగియడంతో ఇక ప్రతిరోజూ మరోసారి బాదుడు తప్పేలా కనిపించడం లేదు. ప్రస్తుతం డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా ఆల్టైమ్ని తాకాయి. అయినా ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. 2014 నుంచి 2016 మధ్య పెట్రోల్పై రూ.11.77, డీజిల్పై రూ.13.47 మేర ఎక్సైజ్ డ్యూటీని పెంచడం గమనార్హం. 2017 అక్టోబర్లో మాత్రమే రూ.2 మేర తగ్గించినా అది పెద్దగా ప్రయోజనం కలిగించలేదు.