ఒడిశా: కాంధమాల్, బొలంగీర్ జిల్లాల్లో పోలీసులకు - మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. కంధమాల్లో ఐదుగురు, బొలంగీర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. అటవీ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటన స్థలంలో భారీ ఎత్తున మందుగుండు సామాగ్రి, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.