ఇండోనేషియా: సురబయ వద్ద పోలీసు ప్రధాన కార్యాలయం లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఆత్మాహుతి దాడిలో ఏడుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ద్విచక్రవాహనంపై కార్యాలయంలోకి ప్రవేశించేందుకు ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు యత్నంచారు. సెంట్రీ నిలువరించగా ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలి వద్ద సీసీ కెమెరాలో ఆత్మాహుతి దాడి దృశ్యాలు నమోదయ్యాయి. ఆత్మాహుతి దాడిలో మహిళ కూడా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. నిన్న మూడు చోట్ల ఉగ్రవాదుల దాడుల్లో 13 మంది మృతి చెందగా పలువురు గాయపడిన సంగతి తెలిసిందే.