ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. భారత్, రష్యాల భాగస్వామ్యం బలోపేతమే లక్ష్యంగా ప్రధాని మోడీ పర్యటన కొనసాగనుంది. సోచీ వేదికగా ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ కానున్నారు. భేటీలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, ఉగ్రవాదం అంశాలపై, సిరియా, అప్గన్లలో నెలకొన్న అశాంతి, అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారు. షాంఘై సహకార సంస్థ సమావేశం, బ్రిక్స్ సమావేశాలపైనా చర్చల్లో ప్రస్తావించనున్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాల బలోపేతంపైనా కూడా చర్చించే అవకాశం ఉంది.