హైదరాబాద్ : నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తుంది. తాగునీటి సమస్య రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా నగరంలో పలు చోట్ల నిర్మించిన మంచినీటి రిజర్వాయర్లను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. అయ్యప్ప సొసైటీ వద్ద రూ. 6.8 కోట్ల వ్యయంతో నిర్మించిన మంచినీటి రిజర్వాయర్ను మంత్రి ప్రారంభించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని డోయెన్స్ కాలనీలో రూ. 12.10 కోట్లతో 8.0 మిలియన్ లీటర్ల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ను నిర్మించారు. గోల్డెన్ తులిప్ వద్ద రూ. 4.68 కోట్లతో 3 మిలియన్ లీటర్ల కెపాసిటీ ఉన్న రిజర్వాయర్ను ఏర్పాటు చేశారు. హైదర్నగర్లో 3.5 మిలియన్ లీటర్ల సామర్థ్యం ఉన్న జలాశయం, హుడా పార్క్ వద్ద 14 మిలియన్ లీటర్ల సామర్థ్యం ఉన్న మంచి నీటి రిజర్వాయర్లను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి మహేందర్రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎంపీ విశ్వేశ్వర్రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.