కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ల కేసులో డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి స్పందించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. న్యాయం గెలిచిందని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి న్యాయస్థానం వ్యవస్థలపై సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా స్పీకర్ న్యాయస్థానాల తీర్పులను గౌరవించి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ల ఎమ్యెల్యేల పదవులను పునరుద్ధరించాలని ఉత్తమ్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు.