హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టావతరణ దినోత్సవ వేడుకలు దక్షిణాఫ్రికాలో ఘనంగా జరిగాయి. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా(టీఏఎస్ఏ) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో డాక్టర్ కేజే శ్రీనివాస్(కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా), టీఏఎస్ఏ అధ్యక్షులు భూమయ్య, జనరల్ సెక్రటరీ నాగరాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. రాష్ర్టావతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ ప్రజలకు కేజే శ్రీనివాస్ రాష్ర్టావతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.