ఆదిలాబాద్: మంత్రి జోగు రామన్న ఇవాళ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జైనథ్ మండలంలో ఆయన పర్యటించారు. మండలంలోని తరోడ గ్రామంలో 15 లక్షలతో నిర్మించే కళ్యాణ మండపానికి మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం సావాపూర్ గ్రామంలో 13 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, 6,50,000 రూపాయలతో నిర్మించిన పాఠశాల భవనాలను మంత్రి ప్రారంభించారు.